Skip to playerSkip to main content
  • 5 years ago
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబరు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగించిన అన్నదాతలు.. తమ ఉద్యమానికి ముగింపు పలికారు. ప్రభుత్వం ముందు రైతులుంచిన అన్ని డిమాండ్లకు ఆమోదం లభించడంతో ఆందోళన విరమించి, ఇళ్లకు పయనమయ్యారు. డిసెంబరు 11 తమ నిరసన కార్యక్రమాలను విరమించి, తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటామని రైతు సంఘాలు గురువారం వెల్లడించిన విషయం తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 380 రోజుల పాటు కొనసాగాయి.

Category

🗞
News

Recommended