Skip to playerSkip to main content
  • 4 weeks ago
Eagle Team On Zero Cultivation On Ganja: రెండేళ్ల కూటమి పాలనలో గంజాయి సాగు సున్నా (జీరో కల్టివేషన్)కు చేరిందని హోంమంత్రి అనిత అన్నారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని నిర్మూలించిన ఈగల్ టీమ్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ మంత్రులు విలువిద్య పోటీలను ప్రారంభించారు. మంత్రులు బాణాలు సంధించి క్రీడా నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు. గంజాయిని సమూలంగా నిర్మూలించిన ఈగల్ టీమ్ ఐజి రవికృష్ణను, ఎస్పీ అమిత్ బర్గర్‌ను సేవలో కొనియాడారు. ట్రైబల్ యువత గంజాయిలో చిక్కుకొని జైలులో మగ్గుతున్నారని గుర్తు చేశారు. గంజాయికి దూరంగా ఉండి యువత క్రీడల్లో ముందుకు వెళ్లాలని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం మీ విలువిద్య పోటీలకు ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. 

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.
Comments

Recommended