Radhashtami celebrations at Iskcon Hyderabad : హైదరాబాద్ అత్తాపూర్ లోని ఇస్కాన్ ఆలయంలో శనివారం రాధాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాధారాణి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మంగళహారతితో ప్రారంభమైన వేడుకల్లో గురుపూజ, దర్శన హారతి, రాధారాణి లీలలపై ప్రత్యేక ప్రవచనం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు రాధారాణి విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, సుగంధ జలాలతో పవిత్రమైన మహాభిషేకం చేపట్టారు. అనంతరం హరే కృష్ణ మహా మంత్రం, భక్తి కీర్తనలు, నామ సంకీర్తనలు మారు మోగాయి. మధ్యాహ్నం రాజభోగ హారతి అనంతరం భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేశారు. ఈ వేడుకలకు సుమారు 10 వేల మంది భక్తులు, సందర్శకులు హాజరయ్యేలా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు మహా ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments